Kidnapping: చాకెట్లు కొనిస్తానని కిడ్నాప్.. చాకచక్యంగా బయటపడ్డ చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnapping: కరీంనగర్ జిల్లా లో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కలకలం రేపింది. కొత్తకొండ నుండి కరీంనగర్లో నానమ్మ చనిపోతే ఓకుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు అక్షిత, లోకేష్. అయితే ఈ ఇద్దరి పిల్లలపై జయశ్రీ అనే వృద్ధురాలు కన్నుపడింది. ఆచిన్నారులను ఎలాగైనా సరే కిడ్నాప్ చేయాలని పన్నాగం వేసింది. ఆఇద్దరి పిల్లలకు మంచి మాటలు చెప్పి బాగా దగ్గరైంది. ఆ చిన్నారులు కూడా ఆ వృద్ధురాలిని నమ్మి ఆచిన్నారి తల్లిదండ్రులు కూడా ఆమె వద్దనే వదిలేసారు. బాగా ఆడుకుంటూ ఆవృద్ధురాలితో ఆడుకుంటుంటే ఆమెను నమ్మారు. అయితే జయశ్రీ అనే వృధ్దురాలు ఆమె తెలివి ఉపయోగించి మెల్లగా పిల్లలను కిడ్నాప్ చేయాలని ఇదే సరైన సమయమని భావించి వాకిరి సాపింగ్ చేద్దామని, మీకు చాక్లెట్లు కొనిస్తానంటూ నమ్మించింది. ఆపిల్లలు చాక్లెట్లు అంటూనే ఆశగా ఆ వృధ్దురాలు వెంట వెళ్లారు.
Read also: Chain Snatching: ఓరేయ్ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు
Also Read
జయశ్రీ కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు పిల్లలతో రైలెక్కి ఔరంగబాద్ తీసుకెళ్లింది. చిన్నారులకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అని ప్రశ్నించినా జవాబు ఇవ్వలేదు. వారిద్దరిని రైల్ లోపలికి తోసేంది. చిన్నారులు ఇద్దరు భాయాందోళనకు గురయ్యారు. మమ్మల్ని వదిలేయ్ మేము వెల్లిపోతాం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసింది. కడుపుపై దారునంగా కొట్టింది. అరవద్దంటూ లేదంటే రైలు నుంచి కిందికి తోసేస్తానంటూ భయపెట్టింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారు ఏడుస్తూనే ఏమీ చేయలేకపోయారు. ఇక ఈ ఇద్దరు చిన్నారులను అమ్మేందుకు జయశ్రీ వృధ్దురాలు వేరే వారికి ఫోన్ చేసి ఐదువేలకు అమ్మేస్తానంటూ మాట్లాడటం ఈ ఇద్దరు చిన్నారులను కలవరపాటుకు గురిచేసింది. ఇద్దరు చిన్నారులు అక్షి, లోకేష్ వద్ద ఫోన్ వుండటంతో పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంతలోనే జాల్నా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై పిల్లలను కొడుతున్న జయ శ్రీ ను చూసి అనుమానంతో అనుమానం తో పిల్లలను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.
Read also: Telangana Assembly: గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. నేడు ధన్యవాద తీర్మానం
ఇద్దరు పిల్లలు మా అదుపులోనే ఉన్నారని మహారాష్ట్ర పోలీసుల నుంచి పిల్లల కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సార్ మా పిల్లలను మావద్దకు చేర్చండి సార్ అంటూ ప్రాధేయపడ్డారు. పిల్లలను పోలీసులు కరీంనగర్ పోలీస్టేషన్కు సేఫ్ గా చేర్చారు. అక్కడే వున్న తల్లిదండ్రులు పిల్లలను చూసి గట్టిగా పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. కరీంనగర్ చేరుకున్న ఇద్దరు పిల్లలు సంతోషం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యావాదాలు తెలిపారు. పోలీసుల వల్లే మా పిల్లలు మావద్దకు వచ్చారని లేదంటే వారిని కోల్పోవాల్సి వచ్చేది అంటూ పోలీసులకు పాదాభివందనం సార్ అంటూ.. ఓతల్లి కడుపుకోతను పోలీసులు అర్థం చేసుకుని చిన్నారులను సేఫ్ గా మా వద్దకు చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ పోలీసులకు సెల్యూట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రెండు రోజులు ముందు కరీంనగర్ లో కలకలం రేపిన ఈఘటన ఇవాల ఆచిన్నారులు తల్లిదండ్రుల వద్ద చేరడంతో సుఖాంతమైంది.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?