Kidnapping Girl: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్కలకలం.. బాలికను కారులో ఎక్కించుకుని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnapping in Jagityala district: తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. రెండు రోజులు కొకసారి చిన్నారు కిడ్నాప్ కేసులు పెరుగుతుండటంతో పోలీసులకు సవాల్ గా మారింది. జగిత్యాల జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొందరు దుండగులు బాలికను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమయ్యారు. దీంతో జగిత్యాల జిల్లాలో జరిగిన ఈఘటన సంచలనంగా మారింది.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
జగిత్యాల రూరల్ మండలం దరూర్ పట్టణంలోని సాయి జనతా గ్యారేజ్ కోటి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారికి సాయి లహరి 12సంవత్సరాల బాలిక 7వ తరగతి చదువుకుంటుంది. పని నిమిత్తం బయటకు వచ్చిన బాలికను కొందరు దుండగులు అక్కడకు కారులో వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడం బాలిక ఒక్కటే అక్కడ వుండటం గమనించిన నలుగురు దుండగులు ఆ బాలికను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇరుగు పొరుగు వారిని అడిగిన, తెలియదనే సమాధానం చెప్పడంతో.. తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. కిడ్నాప్ కు గురైన బాలిక కారులో బంధించి నలుగురు దుండగులు ఫోన్ లో మాట్లాడుతుండటంతో.. బాలిక లహరి చాకచక్యంగా కారులో నుంచి కిందికి దూకేసింది. అక్కడనుంచి పరుగులు పెట్టింది. వారి వద్దనుంచి తప్పించుకుని బయటపడింది. అక్కడ కొందరు స్థానికులను చూసి వారి వద్దనుంచి తండ్రికి ఫోన్ చేసింది. స్థానికుల సహాయంతో తండ్రి ఇంటికి చేరింది లహరి. ఈఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగిత్యాల రూరల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Pragya Thakur: వివాదాస్పద బీజేపీ ఎంపీపై కేసు.. సాధ్వి ప్రజ్ఞాపై కాంగ్రెస్ ఆగ్రహం
బాలికను ఎందుకు ఎత్తుకెళ్లారు అన్నదాని పైన విచారిస్తున్నారు. పట్టణంలోని సాయి జనతా గ్యారేజ్ లోలహారి తండ్రి కోటి మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రిపై కోపంతో కూతురిని కిడ్నాప్ చేశారా? లేక అమ్మాయి పరిచయస్తులు ఎవరైనా, లేక కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్ద వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటే తెలిసిన వారైనా ఉండాలి? బాలిక ఒంటరిగా వెలుతున్నట్లు గమనించారంటే ఆమెను ముందునుంచి ఫాలో అవుతున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నలుగురు యువకులు ఎవరు? ఎక్కడి వారై ఉంటారనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏరియా వారేనా మరెవరైనానైనా.. అనే కోణంలో విచారణ చేపట్టారు. బాలిక లహరి కిడ్నాప్ నుంచి బయట పడటం ఆమె తెలివికి పోలీసులు ప్రసంశించారు. ఇలాంటి వారు ఎవరైనా బాలికలపట్ల వ్యవహరిస్తే చాకచక్యంగా వ్యవహరించాలని భయపడకూడదని, ధైర్యం కోల్పోవద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని కోరారు.
Indian Medicine: చైనాలో భారతీయ మెడిసిన్స్కు భారీ డిమాండ్.. బ్లాక్ మార్కెట్లో కొనుగోలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!