Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద మరోసారి విజృంభిస్తున్న గోదావరి..
- భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతతం 45 అడుగులు..
- కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక..
- 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam Godavari: భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం నుంచి నీటిమట్టం పెరుగుతూ వస్తున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రస్తుతం 45 అడుగుల మేర ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 45 అడుగులు దాటిన నేపథ్యంలో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరో మూడు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా వెలువడే అవకాశం ఉంది.
Read also: AP Crime: ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
ప్రస్తుతం భద్రాచలం వద్ద 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కాగా..భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి వరద మరింత పెరుగుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో అధికారులు నిన్నటి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు.
Read also: AP Crime: ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!
తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంతి. వెంకటాపురం వాజేడు మండలాల్లోని గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు జలమయమయ్యాయి. గోదారి ఎగువపోటుతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు ఉప్పొంగుతుంది. వరద నీరు 163 జాతీయ రహదారిపై చేరడంతో తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. అశ్లీల వీడియోలుతో..
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!