Granite Transport: ప్రజల పాలిట శాపం అవుతున్న గ్రానైట్ లారీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టన్నులకొద్దీ బరువు.. త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్టు బండరాళ్లు.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోని ఆ వాహనాలు యమ దూతల్లా దారి మధ్యలోంచి దూసుకొస్తుంటే వాటి ముందూ.. వెనక ఉన్న ప్రయాణీకులు బిక్కుబిక్కు మంటు ప్రయాణం చేయాల్సి వస్తుంది.లారీపై నుంచి రాళ్లు ఎప్పుడు తమ మీద పడతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న లారీలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కళ్లముందే అజాగ్రత్తగా, ప్రమాదకరంగా రాళ్ళను తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారు రవాణా, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Read also:Gayathri Raghuram: బీజేపీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఖమ్మం జిల్లాలో దాదాపు 300 ల వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. 200 క్వారీల నుంచి రాళ్లను వెలికి తీస్తున్నారు. ఖమ్మం గ్రామీణం, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్వారీల నుంచి రాళ్లను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తుంటారు. తరలింపు సమయంలో చాలామంది గ్రానైట్ క్వారీల యజమానులు నిబంధనలు పాటించటంలేదనే విమర్శలు ఉన్నాయి.గడిచిన రెండు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో రోడ్డుపై గ్రానైట్ ప్రమాదాలు జరిగిన అధికారులు మాత్రం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.
అనుభవం ఉన్న కార్మికులు, యంత్రాల సాయంతో లారీలో రాళ్లను లోడు చేయాలి. ఆ క్రమంలో బండ అటూ ఇటూ కదలకుండా వాటి కింద సపోర్టు ఉంచాలి. లారీ లోంచి రాళ్లు కిందపడకుండా పెన్సింగ్ తీగలతో కట్టాలి కానీ అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకోకుండానే గ్రానైట్ రాళ్ళను తరలిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు.. రద్దీగా ఉండే రహదారుల్లో భారీ వాహనాలలో ఈ రాళ్ళను తరలిస్తుంటారు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేక పోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీ తిగా రవాణా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తనిఖీలు చేసి ఇలా నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాల్లో రాళ్ళను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఖమ్మం పట్టణ వాసులు.
Read Also: GHMC : హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. నగరంలో మరో 9 ఓపెన్ జిమ్లు
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!