Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- వెయ్యి కోట్ల మోసంపై SIT ఏర్పాటు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు దర్యాప్తు బాధ్యతలు
- నిరుద్యోగుల ఖాతాలతో భారీ మనీలాండరింగ్
- ప్రధాన నిందితుల కోసం ముమ్మర గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Cyber Fraud : ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన వెయ్యి కోట్ల రూపాయల ఫైబర్ చీటింగ్, సైబర్ మోసాల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తీవ్రత , వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని, దర్యాప్తు బాధ్యతలను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అప్పగించారు. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ విచారణను వేగవంతం చేసింది.
సిట్ పరిధిలోకి వి.ఎం. బంజారా, సత్తుపల్లి కేసులు
ఖమ్మం జిల్లా పరిధిలోని వి.ఎం. బంజారా , సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి విస్తృత విచారణ ప్రారంభించింది. ప్రతి వారం దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని డీజీపీ ఆదేశించారు. ఈ కేసులో విదేశీ లింకులు, అంతర్రాష్ట్ర మనీలాండరింగ్, బ్యాంకు లావాదేవీల కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
Also Read
నిరుద్యోగులే లక్ష్యంగా వందల కోట్ల దందా
ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఈ ముఠా దారుణమైన మోసానికి పాల్పడింది. బాధితుల పేర్లపై రకరకాల బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, ఆ ఖాతాల ఎటిఎం కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ల పూర్తి నియంత్రణను నిందితులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సైబర్ మోసాల ద్వారా దోచుకున్న రూ. 1,000 కోట్లకు పైగా సొమ్మును బదిలీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
వెలుగులోకి ప్రధాన నిందితుల పేర్లు
ఈ భారీ చీటింగ్ నెట్వర్క్లో పోత్రు ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అతనితో పాటు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ తదితరులను నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితులకు సహకరించిన వ్యక్తులు, బోగస్ కంపెనీలు, సహకరించిన బ్యాంకర్ల నెట్వర్క్పై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు ముమ్మరం కావడంతో ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
-
Gujarat Floods: గుజరాత్ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్చాట్’’ యాప్పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్పై సూర్యకాంత్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!