Khairatabad: శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు.. రేపు మధ్యాహ్నం 12గంటలకు నిమజ్జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జనం మొదలైంది. నవరాత్రి పూజల నిమిత్తం ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు పోలీసు శాఖ సూచన మేరకు మినిట్ టు మినిట్ విడుదల చేసింది.
శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
గణేష్ శోభాయాత్రకు నగరం ముస్తాబైంది. వీధివీధినా యాత్రికులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్లో దశ మహా విద్యాగణపతి కూడా వీడ్కోలు పలికారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మహా నిమజ్జన ఘట్టం పనులు ప్రారంభమయ్యాయి. శోభాయాత్ర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఉప మండపంలో విగ్రహాలను సిద్ధం చేసి బడ గణేశుడికి అంతిమ పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
నిమజ్జన ప్రక్రియ ఇలా..
* మంగళవారం రాత్రి 11 గంటలకు ఖైరతాబాద్ లో గణపతి చుట్టూ నిర్మించిన షెడ్లను తొలగిస్తారు.
* రాత్రి 11 గంటలకు చిన్న క్రేన్లను ప్రాంగణానికి తీసుకువస్తారు.
* బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉపాలయాల విగ్రహాలను తరలించేందుకు ట్రాలీని సిద్ధం చేయనున్నారు.
* రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది.
* రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఉప మండపాల్లోని విగ్రహాలను తరలిస్తారు.
* అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు శ్రీ దశ మహా విద్యాగణపతికి చివరి పూజ
* అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల వరకు చిన్న విగ్రహాలను ట్రాలీపై తీసుకువస్తారు.
* గురువారం అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భారీ వినాయకుడిని ట్రాలీపై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
* గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య గణపతి విగ్రహాలను భారీ క్రేన్తో ట్రాలీపై తీసుకొచ్చారు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు
* 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది
* ఉదయం 9:30 గంటలకు విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది.
* ఉదయం 10:30 గంటలకు వెల్డింగ్ పని ప్రారంభమవుతుంది
* ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్వామివారికి పూజ కార్యక్రమం
* మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి విగ్రహ నిమజ్జనంతో ఉత్సవం పూర్తయింది.
Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!