Khairatabad: శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు.. రేపు మధ్యాహ్నం 12గంటలకు నిమజ్జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జనం మొదలైంది. నవరాత్రి పూజల నిమిత్తం ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు పోలీసు శాఖ సూచన మేరకు మినిట్ టు మినిట్ విడుదల చేసింది.
శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
గణేష్ శోభాయాత్రకు నగరం ముస్తాబైంది. వీధివీధినా యాత్రికులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్లో దశ మహా విద్యాగణపతి కూడా వీడ్కోలు పలికారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మహా నిమజ్జన ఘట్టం పనులు ప్రారంభమయ్యాయి. శోభాయాత్ర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఉప మండపంలో విగ్రహాలను సిద్ధం చేసి బడ గణేశుడికి అంతిమ పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
నిమజ్జన ప్రక్రియ ఇలా..
* మంగళవారం రాత్రి 11 గంటలకు ఖైరతాబాద్ లో గణపతి చుట్టూ నిర్మించిన షెడ్లను తొలగిస్తారు.
* రాత్రి 11 గంటలకు చిన్న క్రేన్లను ప్రాంగణానికి తీసుకువస్తారు.
* బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉపాలయాల విగ్రహాలను తరలించేందుకు ట్రాలీని సిద్ధం చేయనున్నారు.
* రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది.
* రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఉప మండపాల్లోని విగ్రహాలను తరలిస్తారు.
* అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు శ్రీ దశ మహా విద్యాగణపతికి చివరి పూజ
* అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల వరకు చిన్న విగ్రహాలను ట్రాలీపై తీసుకువస్తారు.
* గురువారం అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భారీ వినాయకుడిని ట్రాలీపై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
* గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య గణపతి విగ్రహాలను భారీ క్రేన్తో ట్రాలీపై తీసుకొచ్చారు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు
* 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది
* ఉదయం 9:30 గంటలకు విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది.
* ఉదయం 10:30 గంటలకు వెల్డింగ్ పని ప్రారంభమవుతుంది
* ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్వామివారికి పూజ కార్యక్రమం
* మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి విగ్రహ నిమజ్జనంతో ఉత్సవం పూర్తయింది.
Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!