MLC Kavitha : రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సెక్రటేరియట్కు రావడం లేదు.. కానీ
- బీసీల హక్కుల కోసం రైలు రోకోకు పిలుపునిచ్చిన కవిత
- “జై తెలంగాణ” అనలేని సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు
- పరిశ్రమల జిల్లా అయిన కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం జాగృతి కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన బిసి సర్వేలో 52 శాతం వచ్చినా.. ఇప్పుడిదే ప్రభుత్వం సర్వే చేస్తే 46 శాతం మాత్రమే చూపించడం అనుమానాస్పదమన్నారు. కొత్తగూడెం సిపిఐ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పార్టీలు అవసరమా అనే దానిపై బిసి యువత ఆలోచించాలన్నారు.
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
కవిత ఆరోపించిన మరో ప్రధాన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా “జై తెలంగాణ” అన్నారా అని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను ఈ ప్రభుత్వం అంగమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు అడగకుండానే సంక్షేమ పథకాలు ఇచ్చినవారు కెసిఆర్ మాత్రమేనన్నారు.ప్రస్తుతం రైతులకు విత్తనాలు, పురుగు మందులు లభ్యం కాకుండా పోయిందని, ప్రభుత్వ నిర్వాహక లోపాన్ని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం పరిశ్రమల జిల్లా అయినప్పటికీ.. అధిక కాలుష్యం సమస్యగా మారిందని, దాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ మూడు మంది మంత్రులు ఉన్నా విమానాశ్రయం రాలేదని, జాగృతి ఆధ్వర్యంలో విమానాశ్రయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. రాములవారి భూములపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానన్నారు.
Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!