MLC Kavitha : రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సెక్రటేరియట్కు రావడం లేదు.. కానీ
- బీసీల హక్కుల కోసం రైలు రోకోకు పిలుపునిచ్చిన కవిత
- “జై తెలంగాణ” అనలేని సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు
- పరిశ్రమల జిల్లా అయిన కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం జాగృతి కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన బిసి సర్వేలో 52 శాతం వచ్చినా.. ఇప్పుడిదే ప్రభుత్వం సర్వే చేస్తే 46 శాతం మాత్రమే చూపించడం అనుమానాస్పదమన్నారు. కొత్తగూడెం సిపిఐ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పార్టీలు అవసరమా అనే దానిపై బిసి యువత ఆలోచించాలన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
కవిత ఆరోపించిన మరో ప్రధాన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా “జై తెలంగాణ” అన్నారా అని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను ఈ ప్రభుత్వం అంగమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు అడగకుండానే సంక్షేమ పథకాలు ఇచ్చినవారు కెసిఆర్ మాత్రమేనన్నారు.ప్రస్తుతం రైతులకు విత్తనాలు, పురుగు మందులు లభ్యం కాకుండా పోయిందని, ప్రభుత్వ నిర్వాహక లోపాన్ని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం పరిశ్రమల జిల్లా అయినప్పటికీ.. అధిక కాలుష్యం సమస్యగా మారిందని, దాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ మూడు మంది మంత్రులు ఉన్నా విమానాశ్రయం రాలేదని, జాగృతి ఆధ్వర్యంలో విమానాశ్రయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. రాములవారి భూములపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానన్నారు.
Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!