MLC Kavitha : రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సెక్రటేరియట్కు రావడం లేదు.. కానీ
- బీసీల హక్కుల కోసం రైలు రోకోకు పిలుపునిచ్చిన కవిత
- “జై తెలంగాణ” అనలేని సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు
- పరిశ్రమల జిల్లా అయిన కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం జాగృతి కృషి
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన బిసి సర్వేలో 52 శాతం వచ్చినా.. ఇప్పుడిదే ప్రభుత్వం సర్వే చేస్తే 46 శాతం మాత్రమే చూపించడం అనుమానాస్పదమన్నారు. కొత్తగూడెం సిపిఐ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పార్టీలు అవసరమా అనే దానిపై బిసి యువత ఆలోచించాలన్నారు.
Also Read
- Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
- Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
కవిత ఆరోపించిన మరో ప్రధాన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా “జై తెలంగాణ” అన్నారా అని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను ఈ ప్రభుత్వం అంగమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు అడగకుండానే సంక్షేమ పథకాలు ఇచ్చినవారు కెసిఆర్ మాత్రమేనన్నారు.ప్రస్తుతం రైతులకు విత్తనాలు, పురుగు మందులు లభ్యం కాకుండా పోయిందని, ప్రభుత్వ నిర్వాహక లోపాన్ని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం పరిశ్రమల జిల్లా అయినప్పటికీ.. అధిక కాలుష్యం సమస్యగా మారిందని, దాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ మూడు మంది మంత్రులు ఉన్నా విమానాశ్రయం రాలేదని, జాగృతి ఆధ్వర్యంలో విమానాశ్రయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. రాములవారి భూములపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానన్నారు.
Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
తాజావార్తలు
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
-
Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!