MLC Kavitha : రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సెక్రటేరియట్కు రావడం లేదు.. కానీ
- బీసీల హక్కుల కోసం రైలు రోకోకు పిలుపునిచ్చిన కవిత
- “జై తెలంగాణ” అనలేని సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు
- పరిశ్రమల జిల్లా అయిన కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం జాగృతి కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన బిసి సర్వేలో 52 శాతం వచ్చినా.. ఇప్పుడిదే ప్రభుత్వం సర్వే చేస్తే 46 శాతం మాత్రమే చూపించడం అనుమానాస్పదమన్నారు. కొత్తగూడెం సిపిఐ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పార్టీలు అవసరమా అనే దానిపై బిసి యువత ఆలోచించాలన్నారు.
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
కవిత ఆరోపించిన మరో ప్రధాన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా “జై తెలంగాణ” అన్నారా అని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను ఈ ప్రభుత్వం అంగమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు అడగకుండానే సంక్షేమ పథకాలు ఇచ్చినవారు కెసిఆర్ మాత్రమేనన్నారు.ప్రస్తుతం రైతులకు విత్తనాలు, పురుగు మందులు లభ్యం కాకుండా పోయిందని, ప్రభుత్వ నిర్వాహక లోపాన్ని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం పరిశ్రమల జిల్లా అయినప్పటికీ.. అధిక కాలుష్యం సమస్యగా మారిందని, దాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ మూడు మంది మంత్రులు ఉన్నా విమానాశ్రయం రాలేదని, జాగృతి ఆధ్వర్యంలో విమానాశ్రయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. రాములవారి భూములపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానన్నారు.
Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!