పిల్లులు కావాలో.. పులి బిడ్డ కావాలో ప్రజలు తేల్చుకోవాలి: కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. తాను నిజాం రాజును.. ప్రజలు తనకు బానిసలు అని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నీతి నిజాయితీ ఉన్నవారు అయన పక్కన ఉండవద్దని సూచించారు.
Read Also: టాప్ గేర్లో హుజురాబాద్ ప్రచారం!
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
తాను ఎవరికీ తలవంచను అని ఈటల అంటే.. అవమానించి బయటకు పంపించారని విమర్శించారు. ఇది ఈటల రాజేందర్కు జరిగిన అవమానం కాదని.. హుజూరాబాద్ ప్రజలకు జరిగిన అవమానమని, తెలంగాణ ఉద్యమ కారులకు జరిగిన అవమానమని కిషన్ రెడ్డి అన్నారు. వెన్నెముక లేనివారు కావాలా?. ధైర్యవంతుడు కావాలా ? పిల్లులు కావాలా ? పులి బిడ్డ కావాలా ? ఆత్మాభిమానం ఉన్నవారు కావాలా? ఆత్మను ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టే వారు కావాలా అన్న విషయం హుజురాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు.
హుజురాబాద్లో బీజేపీ గెలిచిన్నంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగిపోవన్నారు. ఈటల రాజేందర్ వల్ల దళిత బంధు వచ్చింది తప్ప దళితుల మీద ప్రేమతో కాదని ప్రజలు గుర్తించాలన్నారు. అందుకే ఈ పథకానికి ‘ఈటల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు’ అని పేరు పెట్టాలన్నారు. కేసీఆర్కు దళితుల మీద ప్రేమ ఉంటే 31 వ తేదీలోగా తెలంగాణలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలన్నారు. కేసీఆర్ డబ్బులనే నమ్ముకున్నారని.. ప్రజలను కాదని ఎద్దేవా చేశారు. ఓటర్లను కొంటాను.. గెలుస్తాం.. ఫామ్ హౌస్లో పడుకుంటా అని కేసీఆర్ అనుకుంటున్నాడని.. టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నాయకులందరికీ ఈ ఎన్నిక తమ రాజకీయ జీవితంలో మాయని మచ్చ అవుతుందన్నారు. నియంత ప్రభుత్వాన్ని తిప్పి పంపడానికి తెలంగాణ ప్రజలకు హుజూరాబాద్ ప్రజలు మార్గదర్శకంగా ఉండాలన్నారు. తెలంగాణలో ఫామ్ హౌస్ పాలన పోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ ప్రజల గొంతుక అవుతారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!