Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
- కేటీఆర్ విచారణపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
- సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోంది- బండి సంజయ్
- లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు
- కేటీఆర్ని అరెస్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమే- బండి సంజయ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమేనని తెలిపారు. ఫార్ములా ఈ రేస్లో రూ.700 కోట్లు లాభాలు వచ్చాయంటున్న కేటీఆర్.. అవి ఎక్కడున్నాయో కూడా చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే.. కావాలనే ఈ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు.. కచ్చితంగా వారి అవినీతిని బయటపెడుతామని అన్నారు. పొంగులేటి బాంబులు బాంబులు అన్నారు .. దీపావళి పోయింది, ముక్కోటి ఏకాదశి వెళ్లింది.. రేపు సంక్రాతి కూడా పోతుంది.. కానీ అవి పేలవని బండి సంజయ్ విమర్శించారు.
Read Also: Harish Rao : ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు
Also Read
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
మరోవైపు.. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. అమృత్ భారత్ స్కీం ద్వారా ప్రధాని మోడీ 1300 రైల్వే పనులను పునరుద్దరిస్తున్నారని అన్నారు. మార్చి లోపు కరీంనగర్ రైల్వే స్టేషనుని ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రూ.95 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషను పనులు జరుగుతున్నాయి.. సకల సౌకర్యాలతో మోడల్ రైల్వే స్టేషనుగా రూపుదిద్దుతామని చెప్పారు. కరీంనగర్ ఆర్వోబీ పనులు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయాయి.. సేతుబంధు స్కీం ద్వారా కేంద్రప్రభుత్వం నిధులతో ఆర్వోబీ పనులు చేస్తున్నాం.. కేంద్రం వందశాతం పూర్తి నిధులు కేటాయించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి.. భూసేకరణ చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. అంతేకాకుండా.. ఉప్పల్ ఆర్వోబీ పనులని ఆరు నెలలలో పూర్తి చేస్తామన్నారు. అలాగే.. 2027 లోపు కొత్తపల్లి-మనోహరాబాద్ పనులు పూర్తిచేయడానికి టార్గెట్ పెట్టుకున్నామని బండి సంజయ్ చెప్పారు.
Read Also: Kajal : బాలీవుడ్ లో మరో కొత్త ప్రజెక్ట్కి పచ్చజెండా ఊపిన కాజల్
తాజావార్తలు
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!