TPCC Mahesh Goud : కామారెడ్డి బీసీ సభతో రాష్ట్ర రాజకీయాలకు మలుపు

  • కామారెడ్డి బీసీ సభతో రాష్ట్ర రాజకీయాలకు మలుపు
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కవిత వ్యాఖ్యలపై విమర్శలు
  • సీబీఐ దర్యాప్తు తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ – కవిత డ్రామా: మహేష్
  • బీజేపీ సమరభేరి.. బీఆర్‌ఎస్ భవిష్యత్తు లేదన్నమహేష్ గౌడ్
Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీ దోపిడి జరిగింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం. వాటా లో తేడా కారణంగానే కవిత నిజం చెబుతున్నట్లు అర్థమవుతోంది” అన్నారు.

Dhadi Shetty Raja: ప్రజా సమస్యలపై మాట్లాడితే సీఎం తిడుతున్నారు.. ఇది పద్ధతేనా?

×
×
Ad

అలాగే మహేష్ కుమార్ గౌడ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత దోపిడీ గురించి చెప్పి ఉంటే సన్మానించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ – కవిత డ్రామా ఆడుతున్నారు” అని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. “ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. బీజేపీ నాయకుల బండారం బయట పెట్టేందుకు సగం క్యాబినెట్‌నే కామారెడ్డికి తీసుకువచ్చారు. ఈ సభ ద్వారా కేంద్రంపై సమర భేరి మోగిస్తాం. బండి సంజయ్, కిషన్ రెడ్డి బండారాన్ని బయట పెడతాం” అని ఆయన హెచ్చరించారు.

Eating During Eclipse: గ్రహణం సమయంలో ఆహారం తింటున్నారా? ఏమి జరుగుతుందో తెలుసా!