Dhadi Shetty Raja: ప్రజా సమస్యలపై మాట్లాడితే సీఎం తిడుతున్నారు.. ఇది పద్ధతేనా?
- కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన మాజీమంత్రి దాడిశెట్టి రాజా..
- ప్రజా సమస్యలపై మాట్లాడితే సీఎం చంద్రబాబు దుర్భాషలాడుతున్నారు..
- రైతుల సమస్యలను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు: దాడిశెట్టి రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhadi Shetty Raja: ఏపీలో కూటమి ప్రభుత్వంపై కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడే వారిని సీఎం చంద్రబాబు దుర్భాషలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక, వికలాంగులను దొంగలతో పోల్చడం, యూరియా కోసం మాట్లాడే రైతులను మా పార్టీవాళ్లుగా ముద్ర వేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది.. రైతులు ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.
Read Also: Bigg Boss Telugu 9: మరికాసేపట్లో బిగ్ బాస్.. లోపలికి వెళ్లిన వారెవరంటే?
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
అయితే, సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలనకు, కేసులకు ప్రతిపక్షాలు ఎప్పటికీ భయపడవని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఆధార్ కార్డుల ఆధారంగా ఫేక్ రైతులు యూరియా బస్తాలను సేకరించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే, పేదలకు వైద్యం పేరుతో సీఎం కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, వారిని అవమానించేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?