K Laxman: టీఆర్ఎస్కు నూకలు చెల్లాయ్.. అందుకే బీఆర్ఎస్తో కొత్త డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman Fires On KCR New Party BRS: తెలంగాణలో టీఆర్ఎస్కు నూకలు చెల్లాయని.. అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తన ఎనిమిదేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బంగారుమయమైందని జాతీయ పత్రికలు, టీవీలకు తప్పుడు ప్రచారం చేస్తూ.. దేశ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి.. యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కేసీఆర్ కుదువ పెట్టారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.
అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా? రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? గుడి – బడి సొమ్ములను దిగమింగడం, డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? అంటూ కే లక్ష్మణ్ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతా విస్తరింపజేస్తారా? అని నిలదీశారు. దొడ్డు బియ్యం మనతో తినిపించి, సన్న బియ్యం తాను తినడం కేసీఆర్ ఆహార విధానమంటూ మండిపడ్డారు. పాఠశాలల్లో చాక్పీసులు ఇవ్వకపోవడం, కొన్నేళ్ల నుంచి టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా ఉండడం, యూనివర్సిటీలను నాశనం చేయడం నీ దేశ విద్యా విధానమా కేసీఆర్? అని ప్రశ్నించారు.
Also Read
భైంసా అల్లర్లను, హైదరాబాద్లో తీవ్రవాద స్థావరాలను ప్రోషహించడం నీ కొత్త పార్టీ దేశ రక్షణ విధానమా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం చేతగాక తెలంగాణ ఆడబిడ్డల ప్రాణాలు తీయడమే బీఆర్ఎస్ వైద్య విధానమా? పావలా ఖర్చుతో పంటలు పండించే వీలున్న చోట రూపాయి ఖర్చుపెట్టి ప్రాజెక్ట్స్ పేరుతో దోచుకోవడమే బీఆర్ఎస్ నీటిపారుదల విధానమా? అంటూ కేసీఆర్ని కే లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాజకీయ పునరీకీకరణ కానే కాదని.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగుల, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేకే.. తన సొంత షోకుల కోసం ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామాలివని ఆరోపణలు చేశారు. మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజలను మళ్ళించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న విన్యాసాలు ప్రజలకు అర్థమైందని.. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని కే. లక్ష్మణ్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!