BJP Laxman: కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
అట్టడుగు వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. 18 శాతం ఉన్న దళితులకు ఒక మంత్రి అని.. 10 శాతం ఉన్న గిరిజనులకు ఒక మంత్రి పదవని.. ఒక శాతం ఉన్న కులానికి, మీ కుటుంబంలో ఉన్న వారికి 4 మంది మంత్రి పదువులు ఇచ్చారని విమర్శించారు. అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈశాన్య భారతంలో క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారే ముఖ్యమంత్రులు, స్పీకర్లుగా కొనసాగుతున్నారని.. ఇదే మోదీ సామాజిక న్యాయసూత్రం అని అన్నారు.
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
Read Also: Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. యూపీలో సంక్షేమ పాలన సాగుతోందని ఆయన అన్నారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచారని.. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడని.. డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేవని.. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ
బీజేపీ విజయ సంకల్ప సభ షాక్ నుంచి తేరుకోవడానికి కేసీఆర్కు వారం పట్టిందని.. పుత్ర వాత్సల్యంతో ఆర్జేడీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎలా పతనం అయ్యాయో.. అడ్రస్ లేకుండా పోయాయో.. రేపు టీఆర్ఎస్కు కూడా అదే గతి పడుతుందని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ను ఎప్పుడు గద్దె దించాలా అని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దు చేడమని.. ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముషీరాబాద్ లో నీ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తే ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదని గుర్తు చేశారు.
- Tags
- bjp
- cm kcr
- K Laxman
- TRS
- TRS vs BJP
తాజావార్తలు
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..