K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- కామారెడ్డి రైల్ రోకో కేసులో కవితకు కోర్టు సమన్లు
- రేపు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
- బీసీ రిజర్వేషన్ల డిమాండ్తో నిర్వహించిన ఆందోళన
- రైళ్ల రాకపోకలకు అంతరాయం.. 12 మందిపై కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Kavitha : టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా, రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది.
బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత ఆధ్వర్యంలో గతంలో కామారెడ్డిలో భారీ ఎత్తున రైల్ రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా దేవగిరి ఎక్స్ప్రెస్తో పాటు ఒక గూడ్స్ రైలును నిలిపివేయడంతో నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్పై నిరసనలు తెలపడం, రైళ్లను నిలిపివేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు గానూ కవితతో పాటు మరో 12 మంది నాయకులపై రైల్వే చట్టం (Railway Act) 147, 74(a) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!