Jupally Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని అన్నారు. ఎంపీ సీట్లు అయినా రాకపోతాయా అని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బావ బామ్మర్దులు తిక్క వాగుడు.. సొల్లు వాగుడు మానుకోవాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. దోపిడి.. కబ్జా దారులు అనే కదా వాళ్ళను ఓడించింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు రెండు, మూడు సీట్లు వస్తాయేమో అంతే అంటూ జూపల్లి తెలిపారు.
Read also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో వలసలకు తెరలేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలు సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వచ్చిన వార్తలు తెలిసిందే.. అయితే ఈ వ్యవహరం పై బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ ఆదిబోజారెడ్డి, జైనథ్ జెడ్పీటీ నీ తుమ్మల అరుంధతి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ బీజేపీతోపాటు మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ లోని నేతలు మూకుమ్మడిగా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
MLA Rakshana Nidhi: రెండు రోజుల్లో టీడీపీలో చేరడంపై క్లారిటీ..! వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!