Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కసరత్తు.. జనవరి 23న తొలిసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన, సామాజిక వ్యవహారాలు, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. 2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఈ పిటిషన్ కు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Read also: Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
నవంబర్ 11, 2023 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఓ కమిటీ వేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంఆర్పిఎస్ ఆరోపించింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ ఇచ్చిన హామీపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!