Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కసరత్తు.. జనవరి 23న తొలిసారి సమావేశం
Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన, సామాజిక వ్యవహారాలు, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. 2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఈ పిటిషన్ కు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Read also: Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
నవంబర్ 11, 2023 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఓ కమిటీ వేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంఆర్పిఎస్ ఆరోపించింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ ఇచ్చిన హామీపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!