Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కసరత్తు.. జనవరి 23న తొలిసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన, సామాజిక వ్యవహారాలు, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. 2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఈ పిటిషన్ కు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Read also: Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
నవంబర్ 11, 2023 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఓ కమిటీ వేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంఆర్పిఎస్ ఆరోపించింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ ఇచ్చిన హామీపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?