Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కసరత్తు.. జనవరి 23న తొలిసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన, సామాజిక వ్యవహారాలు, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. 2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఈ పిటిషన్ కు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Read also: Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
నవంబర్ 11, 2023 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఓ కమిటీ వేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంఆర్పిఎస్ ఆరోపించింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ ఇచ్చిన హామీపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..