Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కసరత్తు.. జనవరి 23న తొలిసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన, సామాజిక వ్యవహారాలు, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. 2023 నవంబర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఈ పిటిషన్ కు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Read also: Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
నవంబర్ 11, 2023 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఓ కమిటీ వేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, టిక్కెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తమకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంఆర్పిఎస్ ఆరోపించింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మోదీ ఇచ్చిన హామీపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!