Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- జార్ఖండ్లో ఒకేసారి 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
- ‘ఆపరేషన్ నవజీవన్’తో పోలీసులకు భారీ విజయం
- సబ్-జోనల్, ఏరియా కమాండర్లు సహా కీలక నేతల సరెండర్
- LMGలు, INSAS రైఫిళ్లు, 3 వేల తూటాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender : జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్ల నెట్వర్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గురువారం (మే 21, 2026) ఒకేసారి 27 మంది మావోయిస్టులు రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి, పోలీసులకు వీరంతా తమ ఆయుధాలను అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షక దళాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ నవజీవన్’ ఈ చారిత్రాత్మక లొంగుబాటుకు ప్రధాన కారణమైంది. లొంగిపోయిన వారిలో 25 మంది నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు జేజేఎంపీ (JJMP) గ్రూప్నకు చెందిన సభ్యులు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు సానుభూతిపరులలో, క్షేత్రస్థాయి క్యాడర్లో మార్పు తీసుకురావడంలో పోలీసులు పూర్తి విజయం సాధించారు.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హైలెవెల్ లీడర్లు ఉండటం గమనార్హం. మొత్తం 27 మందిలో ఏడుగురు సబ్-జోనల్ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమాండర్లు ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 123 హింసాత్మక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉండి, సుదీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మావోయిస్ట్ అగ్రనేత సాగెన్ అంగారియా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
పోలీసుల ఎదుట మోకాళ్లూనిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలకు అప్పగించారు. ఇందులో భారీ నష్టాన్ని కలిగించే లైట్ మెషిన్ గన్స్ (LMGs), ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ గన్లతో పాటు దాదాపు 3,000 కు పైగా లైవ్ తూటాలు (Ammunition) ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ లొంగుబాటుతో జార్ఖండ్లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన సరాండా , కోల్హాన్ అడవుల్లో మావోయిస్టుల బలం పూర్తిగా క్షీణించిందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలను శాసించిన మావోయిస్ట్ దళాలలో ఇప్పుడు కేవలం 16 నుండి 17 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆ ప్రాంతాన్ని పూర్తి నక్సల్ రహిత జోన్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చట్టాన్ని గౌరవించి లొంగిపోయిన ఈ 27 మంది అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పునరావాస (Rehabilitation) సౌకర్యాలు కల్పిస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. లొంగుబాటు విధానం ప్రకారం వారికి రావాల్సిన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు , వారి పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో కలవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!