Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- జార్ఖండ్లో ఒకేసారి 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
- ‘ఆపరేషన్ నవజీవన్’తో పోలీసులకు భారీ విజయం
- సబ్-జోనల్, ఏరియా కమాండర్లు సహా కీలక నేతల సరెండర్
- LMGలు, INSAS రైఫిళ్లు, 3 వేల తూటాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender : జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్ల నెట్వర్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గురువారం (మే 21, 2026) ఒకేసారి 27 మంది మావోయిస్టులు రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి, పోలీసులకు వీరంతా తమ ఆయుధాలను అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షక దళాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ నవజీవన్’ ఈ చారిత్రాత్మక లొంగుబాటుకు ప్రధాన కారణమైంది. లొంగిపోయిన వారిలో 25 మంది నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు జేజేఎంపీ (JJMP) గ్రూప్నకు చెందిన సభ్యులు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు సానుభూతిపరులలో, క్షేత్రస్థాయి క్యాడర్లో మార్పు తీసుకురావడంలో పోలీసులు పూర్తి విజయం సాధించారు.
Also Read
లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హైలెవెల్ లీడర్లు ఉండటం గమనార్హం. మొత్తం 27 మందిలో ఏడుగురు సబ్-జోనల్ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమాండర్లు ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 123 హింసాత్మక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉండి, సుదీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మావోయిస్ట్ అగ్రనేత సాగెన్ అంగారియా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
పోలీసుల ఎదుట మోకాళ్లూనిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలకు అప్పగించారు. ఇందులో భారీ నష్టాన్ని కలిగించే లైట్ మెషిన్ గన్స్ (LMGs), ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ గన్లతో పాటు దాదాపు 3,000 కు పైగా లైవ్ తూటాలు (Ammunition) ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ లొంగుబాటుతో జార్ఖండ్లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన సరాండా , కోల్హాన్ అడవుల్లో మావోయిస్టుల బలం పూర్తిగా క్షీణించిందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలను శాసించిన మావోయిస్ట్ దళాలలో ఇప్పుడు కేవలం 16 నుండి 17 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆ ప్రాంతాన్ని పూర్తి నక్సల్ రహిత జోన్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చట్టాన్ని గౌరవించి లొంగిపోయిన ఈ 27 మంది అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పునరావాస (Rehabilitation) సౌకర్యాలు కల్పిస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. లొంగుబాటు విధానం ప్రకారం వారికి రావాల్సిన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు , వారి పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో కలవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!