T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
- నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు?
- కేసీఆర్ఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం..
- కేసీఆర్ తీరు దొంగే పోలీస్ లను బెదిరిచ్చినట్టు ఉంది..
- విచారణకు సహకరించకపోవడమె కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీస్ లను బెదిరిచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడమె కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నాడని తెలిపారు.
Read also: D. Sridhar Babu: చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
విద్యుత్ ప్రాజెక్ట్ లలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్కె తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40 వేల కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకె విద్యుత్ లభిస్తుంది.. యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదిక తో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Happy Fathers Day: నాన్న మాటల్లో ప్రేమ.. కోపంలో బాధ్యత.. అణుక్షణం బిడ్డ గురించే ఆలోచన..
మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తామన్నారు. లేఖలో కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలతో పోల్చి చూడాలని అన్నారు. బిహెచ్ఇఎల్ ప్రతినిధులను కూడా వాస్తవాలపై వివరాలు అడుగుతారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునరాలోచన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Traffic Restrictions: అలర్ట్… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!