JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఇవాళ ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.
Read also: Manipur : మణిపూర్లో పోలీసు పోస్టులు, 70ఇళ్లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
JEE అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలను తనిఖీ ఇలా..
* ఫలితాల కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి. – https://jeeadv.ac.in/
* హోమ్పేజీలో JEE (అడ్వాన్స్డ్) 2024 ఫలితాల లింక్పై క్లిక్ చేయండి.
* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయాలి.
* జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తాయి.
* ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి.
Read also: pune porsche car crash: యువకుడి కుటుంబానికి చెందిన లగ్జరీ అపార్టుమెంట్లు ధ్వంసం
ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. దాదాపు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు సెషన్లలో కలిపి 14.10 లక్షల మంది జేఈఈ మెయిన్కు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో కటాఫ్ మార్కులతో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్కు అర్హులవుతారు. అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది నమోదు చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది నమోదు చేసుకున్నారు.
Read also: Manipur : మణిపూర్లో పోలీసు పోస్టులు, 70ఇళ్లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు
ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా, 40,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 25న ప్రకటించనుండగా, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు మే 7 వరకు గడువు ఉంది. ఐఐటీ మద్రాస్ మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను నిర్వహించింది. మే 31న జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Amravathi: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!