Kaleswaram: కాళేశ్వరంలో కార్తీక శోభ, ముక్తీశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కాళేశ్వరంలో కార్తీక మాసం శోభ..
- ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- పవిత్ర నదిలో దీపాలను వదిలి పెడుతున్న భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleswaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. కాళేశ్వరంలో కొలువైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర నదిలో దీపాలను వదిలి పెడుతున్నారు.
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
అయితే, పవిత్ర స్నానాల తర్వాత భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానిక తరలి వెళ్తున్నారు. అక్కడ స్వామివారికి భక్తిశ్రద్ధలతో మారేడు దళాలు సమర్పించి, ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు చేస్తున్నారు. అలాగే, శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భక్తులు లక్ష చుక్కల ముగ్గు వేసి, దీపాలు వెలిగించి, దీప దానం చేసి, ప్రదక్షిణలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!