Kaleswaram: కాళేశ్వరంలో కార్తీక శోభ, ముక్తీశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కాళేశ్వరంలో కార్తీక మాసం శోభ..
- ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- పవిత్ర నదిలో దీపాలను వదిలి పెడుతున్న భక్తులు..
Kaleswaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. కాళేశ్వరంలో కొలువైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర నదిలో దీపాలను వదిలి పెడుతున్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
- Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
అయితే, పవిత్ర స్నానాల తర్వాత భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానిక తరలి వెళ్తున్నారు. అక్కడ స్వామివారికి భక్తిశ్రద్ధలతో మారేడు దళాలు సమర్పించి, ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు చేస్తున్నారు. అలాగే, శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భక్తులు లక్ష చుక్కల ముగ్గు వేసి, దీపాలు వెలిగించి, దీప దానం చేసి, ప్రదక్షిణలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో