Komrelly Mallanna: మల్లన్న మూలవిరాట్ దర్శనం రద్దు.. మళ్ళీ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komrelly Mallanna: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జాతర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతరకు సంబంధించి కొమురవెల్లి ఆలయ కమిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలో జనవరి 1వ తేదీ నుంచి భక్తులకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనాన్ని రద్దు చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. సోమవారం (2024 జనవరి 1వ తేదీ) సాయంత్రం నుంచి మూలవిరాట్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. జనవరి 7న కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణంతో జాతర ప్రారంభమవుతుందని ఈవో ఆలూరు బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు కొమురవెల్లి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గర్భగుడిలో స్వామి, అమ్మవార్ల విగ్రహాలను అలంకరించనున్నారు. ఈ మేరకు మూల విరాట్ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
Read also: Gang War: వీరి దుంప తెగ.. రైల్వే ట్రాక్ పై కొట్టుకుని ప్రాణాలే పోగొట్టుకున్నారు కదరా..!
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కొమురవెల్లి మల్లన్న ఈ నెల 31 రాత్రి నుంచి నిజ జీవిత దర్శనాలను నిలిపివేయాలని తొలుత భావించినట్లు తెలిపారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంతోపాటు మరుసటి రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి నిర్ణయం మార్చుకున్నట్లు వివరించారు. జనవరి 2వ తేదీ ఉదయం నుంచి మూలవిరాట్ దర్శనం కాకుండా అర్థమండపంలో విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఇక కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం వచ్చేనెల 7న జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ కల్యాణానికి దాదాపు 40 వేల మంది హాజరవుతారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ కల్యాణోత్సవం, జాతర సన్నాహాలను వారం రోజులుగా పూర్తి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిసారి స్వామివారి కల్యాణోత్సవానికి నెల రోజుల ముందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
World’s Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. 100 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాధిపతి
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!