Telangana: రాష్ట్రవ్యా ప్తంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్పై స్పెషల్ డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ దృష్టి సారిస్తున్నారు. ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఈసారి ధ్రువపత్రం అందని వాహనాలతో పాటు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ ఈనెల 12 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
Read also: Crazy Thieves: దొంగతనానికి వెళ్లారు.. గుడ్లు వండుకుని తిన్నారు.. ఆతరువాత..
Also Read
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఏటా ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించాలని, ట్యాక్సీ, బీమా, పొల్యూషన్ పర్మిట్ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండాలని, 60 ఏళ్లు మించకూడదని చెప్పారు. డ్రైవర్ వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలని, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదు పుస్తకం, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని, ప్రతి బస్సులో అటెండర్ను నియమించాలని సూచించారు. జాబితాతో పాటు బస్సు రూట్ ప్లాన్ జత చేయాలని స్పష్టం చేశారు. డ్రైవర్ అగ్నిమాపక యంత్రం, RTO నిర్వహించే ఒక-రోజు రిఫ్రెషర్ శిక్షణా కోర్సుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
Read also: Road Accident: ఏపీలో రోడ్డు టెర్రర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి
తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు 23,824 ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు 33 జిల్లాల్లో 14,809 బస్సులను తనిఖీ చేశామని, అందులో 157 బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో అనుమతి లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్లో గరిష్టంగా 41 బస్సులు, ఖమ్మంలో 30 బస్సులను నిషేధించారు. ఇంకా 9,015 బస్సులను తనిఖీ చేయాల్సి ఉందని జేటీసీ రమేష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 5,732 బస్సులు, మేడ్చల్ జిల్లాలో 5,609 బస్సులు, హైదరాబాద్లో 1,290 బస్సులు, సంగారెడ్డిలో 1,222 బస్సులు ఉన్నాయి.
Read also: Yellow Alert: మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు ప్రైవేట్ బస్సులు కూడా ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అధికారులు నిర్వహించే తనిఖీల్లో అనధికారికంగా నడుస్తున్న బస్సుల వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. తనిఖీల సమయంలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని, దీంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లు దాటిన విద్యా సంస్థలకు చెందిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నడపరాదని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే ఆ బస్సులను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Harom Hara : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?