IT Raids In Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids In Hyderabad: బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన బట్టల షోరూమ్ల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు దుస్తుల షోరూమ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ తో పాటు మరికొన్ని వస్త్ర దుకాణాలు ఉన్నాయి.
ఇవాల ఉదయం నుంచి బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Also Read
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ఇక భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో ఏకకాలంలో 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పలు కంపెనీల్లో బినామీగా ఉన్నట్లు సమాచారం. అతను 15 కంపెనీలలో పెట్టుబడిదారుడు. ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా కొంతకాలంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు రిటర్నుల్లో పేర్కొన్న అంశాలపై అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!