IT Raids In Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids In Hyderabad: బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన బట్టల షోరూమ్ల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు దుస్తుల షోరూమ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ తో పాటు మరికొన్ని వస్త్ర దుకాణాలు ఉన్నాయి.
ఇవాల ఉదయం నుంచి బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో ఏకకాలంలో 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పలు కంపెనీల్లో బినామీగా ఉన్నట్లు సమాచారం. అతను 15 కంపెనీలలో పెట్టుబడిదారుడు. ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా కొంతకాలంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు రిటర్నుల్లో పేర్కొన్న అంశాలపై అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!