Malla Reddy IT Raids: నేడు మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Officials Questioning Second Day On Malla Reddy Assets: ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదన్న ఆరోపణలతో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే! రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ తొలిరోజు విచారణ ముగియగా.. నేడు రెండో రోజు విచారణ కొనసాగనుంది. మొదటిరోజు ఐటీ కార్యాలయంలో 12 మందిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణకు మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ ఇద్దరిని అధికారులు ఎక్కువ సమయం విచారించారు.
మరోవైపు.. మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీలకు చెందిన ఆదాయ పన్ను వ్యత్యాసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా.. వంద కోట్ల రూపాయల్ని అధికంగా కాలేజీ డొనేషన్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మొదటి రోజు మెడికల్ కాలేజీలకు చెందిన డాక్యుమెంట్లతో విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్లు, అకౌంటెట్లు, ఆడిటర్లు.. రెండో రోజు విచారణకూ హాజరు కానున్నారు. అయితే.. ఈరోజు విచారణకు మల్లారెడ్డి తరపున ఆడిటర్లు హాజరు కానున్నారు. ఇక వీరితో పాటు కొత్తగా సమన్లు అందుకున్న పదిమందితో పాటు మరికొందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. నేడు విచారణలో భాగంగా.. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సిబ్బంది, అకౌంటెంట్లను ఐటీ శాఖ ప్రశ్నించనుంది. తొలిరోజు విచారణలో పలువురికి ఐటి ఫార్మాట్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించిన ఐటీ అధికారులు.. నేడు బ్యాంక్ ఖాతాలపై విచారించనున్నారు.
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
కాగా.. తొలిరోజు ఐటీ అధికారులు ఐదు గంటల పాటు విచారణ సాగించారు. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?