Malla Reddy IT Raids: నేడు మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Officials Questioning Second Day On Malla Reddy Assets: ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదన్న ఆరోపణలతో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే! రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ తొలిరోజు విచారణ ముగియగా.. నేడు రెండో రోజు విచారణ కొనసాగనుంది. మొదటిరోజు ఐటీ కార్యాలయంలో 12 మందిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణకు మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ ఇద్దరిని అధికారులు ఎక్కువ సమయం విచారించారు.
మరోవైపు.. మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీలకు చెందిన ఆదాయ పన్ను వ్యత్యాసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా.. వంద కోట్ల రూపాయల్ని అధికంగా కాలేజీ డొనేషన్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మొదటి రోజు మెడికల్ కాలేజీలకు చెందిన డాక్యుమెంట్లతో విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్లు, అకౌంటెట్లు, ఆడిటర్లు.. రెండో రోజు విచారణకూ హాజరు కానున్నారు. అయితే.. ఈరోజు విచారణకు మల్లారెడ్డి తరపున ఆడిటర్లు హాజరు కానున్నారు. ఇక వీరితో పాటు కొత్తగా సమన్లు అందుకున్న పదిమందితో పాటు మరికొందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. నేడు విచారణలో భాగంగా.. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సిబ్బంది, అకౌంటెంట్లను ఐటీ శాఖ ప్రశ్నించనుంది. తొలిరోజు విచారణలో పలువురికి ఐటి ఫార్మాట్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించిన ఐటీ అధికారులు.. నేడు బ్యాంక్ ఖాతాలపై విచారించనున్నారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
కాగా.. తొలిరోజు ఐటీ అధికారులు ఐదు గంటల పాటు విచారణ సాగించారు. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!