Minister Sridhar Babu: శ్వేత పత్రాలను చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహంవేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాం. అందుకే గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి. శ్వేత పత్రాలు నిజమేనని, అప్పులు చేశామని.. చేసిన ఖర్చు వల్ల ప్రయోజనాలు లేవని గత ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రంలో ప్రతి యువకుడి పై 7లక్షల అప్పును BRS ప్రభుత్వం మోపింది.
Also Read: #HBDYSJagan: ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు.. ట్రెండింగ్లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే …BRS పదేళ్లు అనుభవించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చెయ్యకపోతే BRS 12 గంటల కరెంట్ ఇచ్చేది కాదు. అప్పులపై జవాబు చెప్పలేక BRS ఎమ్మెల్యేలు తెల్లమొహాలు పెట్టారు. రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర, విద్యా వ్యవస్థ పై సమాధానం చెప్పకుండా BRS నాయకులు తెల్లమొహం వేశారు. గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉంది.. మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ , ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు తెల్లమొహాలు వేశారు. 2018లో అసెంబ్లీలో ఈ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో లెక్కలు చెప్పలేదు ఎందుకంటే BRS లో కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి. శ్వేత పత్రాల్లోని లెక్కలు తప్పులు అనేది అవాస్తవం.. తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది.
Also Read: Corona Cases: హైదరాబాద్లో కరోనా హడల్.. మరో ఇద్దరికి పాజిటివ్
అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం.. కావాలంటే స్పీకర్ అదేశంతో ప్రతీ సభ్యుడికి అందిస్తాం. శ్వేత పత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరికి సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తాం. ప్రజాస్వామ్య దృక్పథంతో లెక్కలు ప్రజల ముందు పెట్టాం. గతంలో BRS ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తరువాత అసెంబ్లీ పెట్టీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీ పెట్టినాం. ఎవరినో కించపరిచాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు’ అని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!