Pailla Shekar Reddy: పైళ్ల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ.. ఆ పత్రాలు అందించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆయనకు విచారణ హాజరు కావాలన్న నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఆయనను ఐటీ అధికారులు విచారించారు. కొద్ది సేపు విచారించిన అనంతరం పైల్ల శేఖర్ రెడ్డి కి పంచనామా పత్రాలు ఐటీ అధికారులు అందజేశారు. కొన్ని అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై పైళ్ల నుండి ఐటీ అధికారులు వివరణ తీసుకున్నట్లు సమచారం. దీంతో పైళ్ల శేఖర్ రెడ్డితో ఐటీ విచారణ ముగిసింది. ఇటీవల హైదరాబాద్లోని పైల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత విచారణకు హాజరుకావాలని పైల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు పైళ్ల శేఖర్ రెడ్డి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
కాగా, ఇటీవల మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డితో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితోపాటు పైల శేఖర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఒక్కరోజు సోదాలు నిర్వహించగా, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు చేశారు. ఈ సోదాలు కక్ష సాధింపు చర్యలేనని నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా శేఖర్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా ఎలాంటి అక్రమ ఆస్తులు కనిపించలేదని, అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘ఐటీ సోదాలపై మూడు రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.. ఐటీ అధికారులు నా ఇంట్లో, బంధువుల ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, నేను దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నానని కొన్ని కథనాలు వచ్చాయి. ఈ కథనాలలో నిజం లేదని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?