Isro Chief Somanath: ఇస్రో చైర్మన్ సోమనాథ్కు గౌరవ డాక్టరేట్.. జేఎన్టీయూ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isro Chief Somanath: చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్కు తెలంగాణ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా దీన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ.కట్టా నరసింహా రెడ్డి తెలిపారు. ఈ నెల 5న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, JNTU ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారు అనంతరం డాక్టర్ సోమనాథ్ స్నాతక ప్రసంగం చేస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, డిగ్రీ పూర్తి చేసిన 88,226 మంది ఇంజినీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు. జేఎన్ టీయూలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఐదేళ్లలోపు డ్యూయల్ డిగ్రీ పొందేలా అమెరికా సహా ఇతర దేశాల్లోని పది యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.
Read also: Housing Sales: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ రికార్డు.. వాటికే ఫుల్ డిమాండ్..!
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
జేఎన్టీయూలో మూడేళ్లు, విదేశీ యూనివర్సిటీల్లో రెండేళ్లు చదువుకునేలా ఈ ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో విత్తన కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు UGC-మాలవ్య ఆచార్య శిక్షణా కేంద్రం ప్రారంభించబడింది. క్యాంపస్ నియామకాల్లో జేఎన్టీయూ విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారని వైస్ ఛాన్సలర్ అన్నారు. కొద్ది నెలల క్రితం 309 మందికి బహుళజాతి ఐటీ కంపెనీలు రూ. ఇక్కడ ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకథాన్లో పాల్గొన్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో 73 ప్రాజెక్టులను రూపొందించగా, పరిశ్రమల స్థాపనకు 24 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు వివరించారు.
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!