Cricket Betting: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. షాద్నగర్లో యువకుడి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Betting: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగలా ఉన్న ఐపీఎల్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలను అందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రోజుకూ రూ.2కోట్లకు పైగా చేతులు మారుతున్నాయని సమాచారం. షాద్ నగర్ ఒక్కటే కాదు.. నియోజక వర్గ వ్యాప్తంగా పలు పల్లెల్లో సైతం క్రికెట్పై బెట్టింగ్ సాగుతోంది. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో తన మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. తాండకు చెందిన పలువురు ప్రజలు ప్రకాష్ ఆత్మహత్యను చూసి హోరున విలపిస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు చిత్రమైందని భావించి కన్నీరు మున్నీరవుతున్నారు. తాండకు చెందిన ఆంగోతు అమరుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది ప్రకాష్ చిన్న కుమారుడు. ఇలా అర్ధాంతరంగా బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడం తండాను కలచివేస్తుంది.
Also Read
యువకుడు ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వీర్లపల్లి శంకర్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించారు. ప్రకాశ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. బెట్టింగ్ ముఠా నుండి యువకులను పోలీసులు రక్షించాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతపై ఒక డేగ కన్ను వేయాలని, పోలీసులు ఆ దిశగా ప్రత్యేక కోణం ద్వారా విచారణ జరిపి బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం చలాన్లు ఇతర చిన్నచిన్న నేరాల కాకుండా ఇలాంటి మోసాలపై బెట్టింగ్ లపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకాష్ తల్లిదండ్రులను పరామర్శించారు.
Etela Rajender: నేను అలాంటి వ్యక్తిని కాదు.. బీజేపీ నేతలపై ఈటెల కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!