Cricket Betting: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. షాద్నగర్లో యువకుడి ఆత్మహత్య
Cricket Betting: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగలా ఉన్న ఐపీఎల్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలను అందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రోజుకూ రూ.2కోట్లకు పైగా చేతులు మారుతున్నాయని సమాచారం. షాద్ నగర్ ఒక్కటే కాదు.. నియోజక వర్గ వ్యాప్తంగా పలు పల్లెల్లో సైతం క్రికెట్పై బెట్టింగ్ సాగుతోంది. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో తన మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. తాండకు చెందిన పలువురు ప్రజలు ప్రకాష్ ఆత్మహత్యను చూసి హోరున విలపిస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు చిత్రమైందని భావించి కన్నీరు మున్నీరవుతున్నారు. తాండకు చెందిన ఆంగోతు అమరుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది ప్రకాష్ చిన్న కుమారుడు. ఇలా అర్ధాంతరంగా బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడం తండాను కలచివేస్తుంది.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
యువకుడు ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వీర్లపల్లి శంకర్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించారు. ప్రకాశ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. బెట్టింగ్ ముఠా నుండి యువకులను పోలీసులు రక్షించాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతపై ఒక డేగ కన్ను వేయాలని, పోలీసులు ఆ దిశగా ప్రత్యేక కోణం ద్వారా విచారణ జరిపి బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం చలాన్లు ఇతర చిన్నచిన్న నేరాల కాకుండా ఇలాంటి మోసాలపై బెట్టింగ్ లపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకాష్ తల్లిదండ్రులను పరామర్శించారు.
Etela Rajender: నేను అలాంటి వ్యక్తిని కాదు.. బీజేపీ నేతలపై ఈటెల కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!