NTV Telugu Site icon

Indrakaran Reddy: నేడు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిల పర్యటన

నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హ‌రీష్ రావు, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప‌ర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాస‌ర జ్ఞాన స‌ర‌స్వతీ అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు మంత్రులు. ఉద‌యం 9 గంట‌ల‌కు బాస‌ర‌లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉద‌యం 9.20 గంట‌ల‌కు ముధోల్ లో 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు.

12.15 గంట‌ల‌కు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిట‌ల్ లో రేడియాల‌జీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో 250 ప‌డ‌క‌ల జిల్లా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేడియాల‌జీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తారు. తరువాత రిమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ బ్లాక్ ను ప్రారభించనున్నారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. సాయంత్రం 5.30 గంట‌ల‌కు వైద్య, ఆరోగ్యంతో పాటు ఇత‌ర విభాగాల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వహించనున్నారు మంత్రులు.

మరోవైపు నిర్మల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా భైంసా డివిజన్ లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.