Telangana Weather: తెలంగాణలో పెరిగిన చలి.. గజగజ వణుకుతున్న జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather: తెలంగాణలో చలి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలతో చలి తగ్గినప్పటికీ తాజాగా పెరుగుతోంది. రాత్రి కాకుండా పగలు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉంది.
Read also: CM Revanth Reddy: హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి.. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సింగిల్ డిజిట్ కు గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా బేల లో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో 10.4 డిగ్రీలు నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబీలో 11 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లా భిమినిలో 14.8గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం కూడా చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా డిసెంబర్ మరియు జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
Read also: Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ
రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Top Headlines@9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!