Occult worship: మహబూబాబాద్లో మరోసారి క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Occult worship: ఇది డిజిటల్ యుగం. టెక్నాలజీని అందిపుచ్చుకుని మనిషి అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అయినప్పటికీ, కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దుష్టశక్తుల ప్రభావం, చేతబడి, బాణసంచా, చిల్లంగి మొదలైన వాటి ప్రభావం గురించి అనవసరంగా ఆందోళన చెందుతారు. కొందరు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజించి తమకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తారు. నిర్మానుష్య ప్రాంతాలు, జనసంచారం లేని రోడ్ల పక్కన, స్మశాన వాటికలు, వీధుల్లో ఇలాంటి దృశ్యాలు చూస్తూనే ఉంటాం. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెంది, మనిషి అంతరిక్షంలోకి వెళుతున్న ప్రస్తుత కాలంలో కూడా కొందరు క్షుద్ర పూజలను నమ్మడం, ప్రపంచం టెక్నాలజీతో ముందుకు సాగుతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి దగ్గర అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. పసుపు బియ్యం, బొమ్మ, వెంట్రుకలు, సూదులతో క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతారు. గతంలో కూడా క్షుద్ర పూజలు చేయడం వల్లే తమ పెంపుడు కుక్క చనిపోయిందని కిన్నెర మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం పారమండ్ల సంకీస గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. క్షద్రపూజలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read
తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. పాఠశాలలోని తరగతి గదిలో పసుపు, కుంకుమ, బొమ్మ, నిమ్మకాయలతో పూజలు చేసిన గుర్తులు కనిపించాయి.దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలకు గేట్లు లేకపోవడం, సరైన భద్రత లేకపోవడంతో గత కొంతకాలంగా పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెండు నెలల క్రితం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోత్ స్కూల్లో కొందరు గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలోకి ప్రవేశించిన విద్యార్థులు సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ముందు క్షుద్ర పూజలు చేశారు. వింత ఆకారంలో ఉన్న వస్తువులు, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. భయంతో వణికిపోయిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలిపారు.
Earthquake: అసోం, అండమాన్ దీవుల్లో భూప్రకంపనలు..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!