Occult worship: మహబూబాబాద్లో మరోసారి క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Occult worship: ఇది డిజిటల్ యుగం. టెక్నాలజీని అందిపుచ్చుకుని మనిషి అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అయినప్పటికీ, కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దుష్టశక్తుల ప్రభావం, చేతబడి, బాణసంచా, చిల్లంగి మొదలైన వాటి ప్రభావం గురించి అనవసరంగా ఆందోళన చెందుతారు. కొందరు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజించి తమకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తారు. నిర్మానుష్య ప్రాంతాలు, జనసంచారం లేని రోడ్ల పక్కన, స్మశాన వాటికలు, వీధుల్లో ఇలాంటి దృశ్యాలు చూస్తూనే ఉంటాం. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెంది, మనిషి అంతరిక్షంలోకి వెళుతున్న ప్రస్తుత కాలంలో కూడా కొందరు క్షుద్ర పూజలను నమ్మడం, ప్రపంచం టెక్నాలజీతో ముందుకు సాగుతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి దగ్గర అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. పసుపు బియ్యం, బొమ్మ, వెంట్రుకలు, సూదులతో క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతారు. గతంలో కూడా క్షుద్ర పూజలు చేయడం వల్లే తమ పెంపుడు కుక్క చనిపోయిందని కిన్నెర మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం పారమండ్ల సంకీస గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. క్షద్రపూజలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read
తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. పాఠశాలలోని తరగతి గదిలో పసుపు, కుంకుమ, బొమ్మ, నిమ్మకాయలతో పూజలు చేసిన గుర్తులు కనిపించాయి.దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలకు గేట్లు లేకపోవడం, సరైన భద్రత లేకపోవడంతో గత కొంతకాలంగా పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెండు నెలల క్రితం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోత్ స్కూల్లో కొందరు గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలోకి ప్రవేశించిన విద్యార్థులు సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ముందు క్షుద్ర పూజలు చేశారు. వింత ఆకారంలో ఉన్న వస్తువులు, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. భయంతో వణికిపోయిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలిపారు.
Earthquake: అసోం, అండమాన్ దీవుల్లో భూప్రకంపనలు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!