CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్ కోరిక..
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి..
- రాహూల్ గాంధీ ప్రధాని కావాలి అన్నది వైఎస్ఆర్ కోరిక ..
- వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలి అన్నది వైఎస్ఆర్ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు గాంధీ భవన్ కి చేరుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమం.. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ పేరు వినిపిస్తే.. సంక్షేమం పేరు వినిపిస్తుందన్నారు. వైయస్సార్ ముద్ర ప్రజలకు గుండెల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైయస్సార్ 2004లో అమలు చేసిన సంక్షేమం అన్నారు. వైఎస్ 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ కోరిక అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర నే రాహూల్ గాంధీ పాదయాత్ర స్ఫూర్తి అన్నారు.
Read also: Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహూల్ గాంధీ వున్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తేనే పేదలకు మేలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలని తెలిపారు. వైఎస్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధాని నీ చేయడానికి ప్రతిజ్ఞ తీసుకుందామన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పని చేసేవారే నిజమైన వైయస్సార్ వారసులని తెలిపారు. నిన్నటికి నేను పీసీసీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అన్నారు. ఈ మూడు సంవత్సరాల లో ఎన్నో ఒడిదుడుకుల ఎదుర్కొన్నామన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించామన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. పని చేసిన వారికే పదవులు ఇచ్చామని అన్నారు. పైరవీ కారులకు పదవులు ఇవ్వలేదన్నారు. కార్యకర్తలను కాపాడుకునే అంశంలో వైఎస్ఆర్ స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. కేవీపీ 1983 లో వైఎస్ పీసీసీ అయ్యారని.. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ లో రంగులు వేశారు వైఎస్ అన్నారు. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు వైఎస్ అని తెలిపారు.
Read also: Ajith : అజిత్ ఈ సారి కాపీ కొడుతున్నాడా..?
మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైఎస్ ఆలోచన మార్గంలో ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలకోసం అంకితం అయ్యి పని చేస్తున్నామని తెలిపారు. వైఎస్ పాలన చిరస్థాయిలో నిలుస్తుందన్నారు. వైఎస్ పాద ముద్రలు ఇంకా ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ కి దూరంగా వెళ్లిన వాళ్ళు..ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. ఇదే ప్రభుత్వ పాలనకు ఇచ్చి గౌరవం అన్నారు. పార్టీ నుండి బయటకు వెళ్లిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి రండి అని పిలుపు నిచ్చారు. ఇందిరమ్మ సర్కార్ ని ప్రజల దగ్గరికి తీసుకుపోదాం అన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకుని తిరిగేలా పని చేస్తామన్నారు.
Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!