Hyderabad Water: హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 4,5న నీళ్లు బంద్..!
- ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు..
- హైదరాబాద్ లో 4-5న నీళ్లు బంద్..
- 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం..
- ప్రజలు సహకరించాలని అధికారులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Water: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేయనున్నారు. 4వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. షేక్పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెసర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్బీ, హైదర్నగర్, నల్గండ్ల, చందానగర్, హుడాకాలనీ, హఫీజ్పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరారు.
Read also: Plastic Cover in Biryani: చికెన్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
తాజాగా.. జూన్ 26, బుధ, 27వ తేదీల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫేజ్-2 తాగునీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) ప్రభావిత ప్రాంతాల నివాసితులకు నీటిని పొదుపుగా ఉపయోగించాలని సూచించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటిని అందిస్తోంది. అయితే కొండాపూర్ పంప్ హౌస్ లోని రెండో పంపు ఎన్ ఆర్ వీ వాల్వ్ అనూహ్యంగా మరమ్మతులకు గురికావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనితో NPA, మీర్ ఆలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, అల్లబండ, మేకలమండి, భోలక్పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, తదితర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మండిపడుతున్నారు. రెండు వారాలకు ఒకసారి నీటిని బంద్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Darling: బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!