Hyderabad Water: హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 4,5న నీళ్లు బంద్..!
- ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు..
- హైదరాబాద్ లో 4-5న నీళ్లు బంద్..
- 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం..
- ప్రజలు సహకరించాలని అధికారులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Water: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేయనున్నారు. 4వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. షేక్పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెసర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్బీ, హైదర్నగర్, నల్గండ్ల, చందానగర్, హుడాకాలనీ, హఫీజ్పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరారు.
Read also: Plastic Cover in Biryani: చికెన్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
తాజాగా.. జూన్ 26, బుధ, 27వ తేదీల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫేజ్-2 తాగునీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) ప్రభావిత ప్రాంతాల నివాసితులకు నీటిని పొదుపుగా ఉపయోగించాలని సూచించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటిని అందిస్తోంది. అయితే కొండాపూర్ పంప్ హౌస్ లోని రెండో పంపు ఎన్ ఆర్ వీ వాల్వ్ అనూహ్యంగా మరమ్మతులకు గురికావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనితో NPA, మీర్ ఆలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, అల్లబండ, మేకలమండి, భోలక్పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, తదితర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మండిపడుతున్నారు. రెండు వారాలకు ఒకసారి నీటిని బంద్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Darling: బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్
తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి