CM Revanth Reddy: ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
- తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ..
- ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరైనా తప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Read also: Mallu Bhatti Vikramarka: నేడు కరీంనగర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
సచివాలయంలో మున్సిపల్ పాలనపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హోంగార్డు తరహాలో వీరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, ఫుట్పాత్లు, పారిశుధ్యం తదితర పనుల పురోగతిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై 15 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి సీఎం నిర్ణయంపై ట్రాన్స్ జెండర్లకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్లను వ్యవస్థలో ఒక హోదా ఇస్తూ.. వారిని ఒక మనిషిగా గుర్తిస్తున్నందుకు కృతజ్ఙతలు తెలిపారు. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులో వస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Cucumber: క్రమం తప్పకుండా దోసకాయ తినడం తింటే ఇన్ని మార్పులా..?
తాజావార్తలు
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
-
IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!