ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 46,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 280 పెరిగి రూ. 50, 350 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ. 71,500 వద్ద కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
