Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట..
- గాంధీభవన్లో ఉద్రిక్తత..
- ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నం..
- కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్న పోలీసులు..
- కాంగ్రెస్ కార్యకర్తలు-పోలీసుల మధ్య తోపులాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Bhavan: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తల మధ్య కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Read also: Kamareddy School Bus: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ.. బస్సులో 50 మంది స్టూడెంట్స్..
Also Read
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు యత్నించడంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్లోని గాంధీభవన్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఈ క్రమంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
MSME Policy: ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!