Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు రూ.50 వేల జరిమానా..
- కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.. హైదరాబాద్లోని యూసుఫ్గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించింది.
Also Read
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. యూసుఫ్గూడ భూమి వివాదానికి సంబంధించిన ఈ కేసులో హైడ్రా అధికారుల వ్యవహార శైలిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తదుపరి విచారణలో ఈ వ్యవహారంపై మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?