DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తెలంగాణలో 230 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నారు.. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు అని తేల్చి చెప్పారు. ఇక, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: ACB: ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై కొనసాగుతున్న సోదాలు
అయితే, లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంత మందికి నోటీసులు ఇచ్చామని డీజీపీ జితేందర్ తెలిపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు టైం ఉంది.. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి అని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు అటల్ బోర్డర్ నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అలాగే, షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో-ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తామన్నారు. మరోవైపు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎరివేతలో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆపరేషన్ లేదన్నారు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్ట దగ్గర మోహరించలేదని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
