CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజుల పాటు మకాం అక్కడే..
- ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు..
- మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు..
- ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం పర్యటన ఉంటుందన్న అధికారిక వర్గాలు..
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువు వివాహానికి హాజరై మళ్లీ సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Read also: Telangana GOVT: జీవో 46పై కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. పలువురు మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖల నుంచి గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. మూడు రోజుల పర్యటనలో ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read also:Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉన్నందున, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి విధేయులైన నేతలకు కార్యనిర్వాహక అధ్యక్ష, సీనియర్ ఉపాధ్యక్ష పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో