CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజుల పాటు మకాం అక్కడే..
- ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు..
- మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు..
- ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం పర్యటన ఉంటుందన్న అధికారిక వర్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువు వివాహానికి హాజరై మళ్లీ సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Read also: Telangana GOVT: జీవో 46పై కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. పలువురు మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖల నుంచి గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. మూడు రోజుల పర్యటనలో ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read also:Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉన్నందున, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి విధేయులైన నేతలకు కార్యనిర్వాహక అధ్యక్ష, సీనియర్ ఉపాధ్యక్ష పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!