Telangana GOVT: జీవో 46పై కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ..
- తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana GOVT: రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46ను సవాలు చేస్తూ దాఖలైన కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జివోను సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి వాదనలను తోసిపుచ్చి ఈ ఏడాది ఆగస్టు 28న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ మాటూరి శ్రీకాంత్ సహా 74 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓక, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది. బాధితుల తరఫు న్యాయవాది ఆదిత్య సోండీ.. కేసు పరిష్కారమయ్యే వరకు ఖాళీగా ఉన్న 900 పోస్టుల భర్తీని నిలిపివేయాలని వాదించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వరకు వేచిచూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల తరపున వాదించిన బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సోండి, జి. విద్యాసాగర్, మిథున్ శశాంక్ ఉన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 46 ప్రకారం కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు జీవో వల్ల ఎవరికీ నష్టం లేదని, సమానత్వం ఉందని ధర్నా చేశారు. జివో నెంబర్ 46 రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ తాజా జివో వల్ల గ్రామీణ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందన్న వాదన అర్థరహితమని పోలీసు ఆశావాహులు మండిపడ్డారు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నిబంధనలు రూపొందిస్తే అన్ని జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమానత్వం ఉంటుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో నెం.46ను ప్రవేశపెట్టిందని తెలిపారు.
Read also: Manipur Violence: 23 రోజుల తర్వాత మణిపూర్లో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం .0
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!