Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తండ్రి మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

Rr

Rr

CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్) మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకున్న గొప్ప దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు, అనంతన్ ని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు.

Read Also: NTRNeel : ‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

కాగా, కుమారి అనంతన్ నాలుగు సార్లు శాసన సభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక, తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళసై సౌందరరాజన్ కి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. కుమారి అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని వెల్లడించారు.

Exit mobile version