Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్డేట్స్
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి..
- ఈ సమావేశంలో 19 పద్దులపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024 LIVE UPDATES: నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యాయి. నేడు సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో 19 పద్దులపై చర్చ జరుగుతుంది. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
30 Jul 2024 02:07 PM (IST)
తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ..
అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. శాసనసభ అరగంటపాటు వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైంది. రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా.. అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.
-
30 Jul 2024 12:17 PM (IST)
రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనండి.. సభ్యులను కోరిన స్పీకర్
శాసనసభ అరగంటపాటు వాయిదా పడింది. రుణమాఫీ కార్యక్రమంలో సభ్యులంతా పాల్గొనాలని స్పీకర్ కోరారు.
-
30 Jul 2024 11:56 AM (IST)
అసెంబ్లీ అరగంట వాయిదా..
అసెంబ్లీని స్పీకర్ అరగంట వాయిదా వేశారు.
-
30 Jul 2024 11:46 AM (IST)
15 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీ-వాటికి కేటాయింపులు లేవు - అనిల్ జాదవ్
40 వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సాయం అందించాం. కాంగ్రెస్ పార్టీ దళితబంధు కింద 12 లక్షలు అందిస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. విద్యా జ్యోతి పథకం పేరుతో 10 పాసైన విద్యార్థులకు 10 వేలు, 12 పాసైన విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ పాసైన విద్యార్థులకు 25 వేలు, పీజీ పాసైన విద్యార్థులకు రూ. లక్ష, పీహెచ్డీ పాసైన విద్యార్థులకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి కేటాయింపులు చేయలేదు. ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. 15 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. వాటికి కేటాయింపులు లేవు అని అనిల్ జాదవ్ తెలిపారు.
-
30 Jul 2024 11:44 AM (IST)
ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేడు- అనిల్
ప్రస్తుత ప్రభుత్వంలో మా సమస్యలు ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేకపోవడం.. వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ వాటి అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అనిల్ జాదవ్ తెలిపారు.
-
30 Jul 2024 11:43 AM (IST)
ఉద్యోగాల్లో కేసీఆర్ 95 శాతం రిజర్వేషన్లు అమలు- అనిల్
ఉద్యోగాల్లో కేసీఆర్ 95 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు కూడా కేసీఆర్ పెంచారు. స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. అన్ని గురుకులాలు, మోడల్స్ స్కూల్స్లో అదనపు గదులను నిర్మాణం చేయాలి అని ప్రభుత్వాన్ని అనిల్ జాదవ్ కోరారు.
-
30 Jul 2024 11:43 AM (IST)
జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని .. కానీ అతిగతీ లేదు - అనిల్
జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అతిగతీ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. గ్రూప్- 2లో 2 వేలు, గ్రూప్- 3లో 3 వేల పోస్టులు పెంచుతామన్నారు. కానీ అమలు చేయడం లేదు.
-
30 Jul 2024 11:42 AM (IST)
మైనార్టీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు- అనిల్
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కుల గుణన చేసి మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మైనార్టీ బడ్జెట్ 4 వేల కోట్లకు పెంచి సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కానీ 2258 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు బడ్జెట్లో. మైనార్టీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని ఆయన పేర్కొన్నారు.
-
30 Jul 2024 11:41 AM (IST)
ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.. వాటి ఊసే లేదు- అనిల్
ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ఊసే లేదు. కార్పొరేషన్లకు 25 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్సెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎంతో కష్టమని చెప్పి కల్యాణలక్ష్మి కింద లక్ష కట్నం అందించి కేసీఆర్ ఆదుకున్నారు.
-
30 Jul 2024 11:26 AM (IST)
గిరి వికాస్ పథకం కింద ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు- ఎమ్మెల్యే అనిల్
గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. పోడుభూముల పంపిణీలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని పేర్కొన్నారు.
-
30 Jul 2024 11:24 AM (IST)
శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడారు.
-
30 Jul 2024 11:22 AM (IST)
బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు- సీతక్క
బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని సీతక్క మండిపడ్డారు. తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని తెలిపారు. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తనవని సీతక్క చెప్పారు.
-
30 Jul 2024 11:20 AM (IST)
తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చింది- సీతక్క
ఎస్టీలకు పోడు భూముల చట్టం ద్వారా 2006లో లబ్ధి కలిగించామని మంత్రి సీతక్క తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు మీరేమీ చేయలేదని బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి అని డిమాండ్ చేశారు.
-
30 Jul 2024 11:15 AM (IST)
20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా స్కిల్స్ యూనివర్సిటీ..
శాసనసభలో పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును సభ ముందుంచారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
-
30 Jul 2024 11:05 AM (IST)
అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు
అసెంబ్లీలో ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
-
30 Jul 2024 10:58 AM (IST)
గత ప్రభుత్వం పత్తి వేయొద్దని చెప్పింది- కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం
గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందని తెలిపారు. రైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదన్నారు. పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగిందని తెలిపారు.
-
30 Jul 2024 10:46 AM (IST)
వచ్చే సెషన్ను 20 రోజులు పెట్టాలి- కేటీఆర్
రేపు ద్రవ్య వినిమయ బిల్లు పెడుతున్నారు. ఈ సమావేశాలు అయిపోయాయి. కానీ వచ్చే అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో రోజుకు 19 పద్దులు పెట్టకుండా, 2 లేదా 3 పద్దులపై సావధానంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలి. మంత్రులు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే సెషన్ను అవసరమైతే 20 రోజులు పెట్టాలి. మా వైపు నుంచి తప్పకుండా కో ఆపరేషన్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
-
30 Jul 2024 10:45 AM (IST)
19 పద్దులపై పెట్టకుండా.. 2 లేదా 3 పద్దులపై చర్చ పెట్టండి- కేటీఆర్
ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నడిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నాము. కానీ ఈ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు.. వారందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇలా రోజుకు 19 పద్దులపై చర్చ పెట్టకుండా.. రోజుకు 2 లేదా 3 పద్దులపైన చర్చ పెట్టాలని కోరుతున్నాం.
-
30 Jul 2024 10:37 AM (IST)
నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు-స్పీకర్ విజ్ఞప్తి
లంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సందేశం ఇచ్చారు. నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఒక్కో సభ్యునికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. అనే అంశంపై మాట్లాడాలని సభ్యులందరూ సభ్యులకు సూచించారు.
-
30 Jul 2024 10:25 AM (IST)
రుణమాఫీ పథకం ప్రారంభోత్సవ పనులను పరిశీలించిన మంత్రులు..
ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించబోయే లక్ష నుండి లక్షన్నర వరకు రుణమాఫీ పథకం ప్రారంభోత్సవ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.
-
30 Jul 2024 10:23 AM (IST)
శాసనసభలో 19 డిమాండ్లపై కొనసాగుతున్న చర్చ
శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. స్కిల్ వర్సిటీ బిల్లును సభలో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు.
-
30 Jul 2024 10:21 AM (IST)
తెలంగాణ అసెంబ్లీ ఆరవ రోజు సమావేశం ప్రారంభం
ఆరవ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!