Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇంకా ఏం మిగిలింది..?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ప్రభాకర్రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి..
- ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు..
- ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. మీ పర్పస్ పూర్తయిందా లేదా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు ఇంటరాగేషన్పై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రభాకర్రావు ఇంటరాగేషన్ను పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మీ పర్పస్ పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రభాకర్రావును పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చని, ప్రభాకర్రావు దర్యాప్తుకు సహకరిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఇక, కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనేదే ప్రధాన ప్రశ్నగా లూథ్రా పేర్కొన్నారు. అలాగే, కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్యాప్తు వేగం, కస్టడీ అవసరం, ముందస్తు బెయిల్ అంశాలపై కోర్టు స్పష్టత ఇవ్వడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!