Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రా..
- స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రా..
- కో-చైర్మన్ హోదాలో ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీ గవర్నర్ల బోర్డులో కో-చైర్మన్ హోదాలో సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రసిద్ధి చెందిన మహీంద్రా గ్రూప్కు ఆనంద్ మహీంద్రా చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ అడ్వైజరీ బోర్డు), హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో సభ్యుడు.
Read also: Sri Lakshmi Stotram: రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు
Also Read
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
పద్మభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్శిటీ చైర్మన్గా కూడా కొనసాగాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీని నెలకొల్పుతూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించి ప్రతి సంవత్సరం లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో ఈ వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్ను ప్రయోగించనున్న ఇస్రో
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?