NTV Telugu Site icon

SI Passing Out Parade: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..

Si Paredu

Si Paredu

SI Passing Out Parade: తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్ఐలు చేరబోతున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్‌ పోలీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో వీరికి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వనుంది. వీరందరూ తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిష్త్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read Also: Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్

కాగా, పోలీస్ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరు కాబోతున్నారు. అనంతరం పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కు పలువురు మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు.