Caste Census Survey: తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..
- తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రెండో రోజు కొనసాగుతుంది..
- ఇవాళ- రేపు కూడా ఇళ్లకు స్టిక్కరింగ్ ..
- ఎల్లుండి (9వ తేదీ) నుంచి కుల గణన సర్వే ప్రారంభం..
- 60 రోజుల్లో కులగణన సర్వే పూర్తి చేయాలని టార్గెట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Census Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. తొలిరోజు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అధికారులు అంటించినున్నారు. ఇవాళ, రేపు కూడా ఇళ్లకు స్టిక్కరింగ్ వేయనున్నారు. ఎల్లుండి (9వ తేదీ) నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. 60 రోజుల్లో కులగణన సర్వే పూర్తి చేయాలని టార్గెట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read also: MLAs Fighting: కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో హై టెన్షన్
Also Read
రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 9న ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఇంటి నెంబరు, అందులో నివసిస్తున్న యజమాని పేరు నమోదు ప్రక్రియ సాగింది. ఇందులో ఒక్కో గానకు 150 నుంచి 175 ఇళ్లు కేటాయించి శుక్రవారం వరకు వివరాలు నమోదు చేయనున్నారు. అప్పటికి రాష్ట్రంలోని మొత్తం ఇళ్లు, వాటిలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య జాబితాను సిద్ధం చేస్తారు. ఆపై వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
Read also: Ghaati : ఫస్ట్ లుక్ తో బయపెడుతున్న ‘అనుష్క’
ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు. మొదటి రోజు ఇంటి నెంబరు, నివాసి యజమాని పేరు వంటి వివరాలను నమోదు చేసిన అనంతరం ఎన్యుమరేటర్లు ఆయా ఇళ్లపై స్టిక్కర్లు వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 11,97,554 ఇళ్లకు గానూ తొలిరోజు 95,106 (48 శాతం) ఇళ్లకు స్టిక్కర్లు అందజేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా విభాగం ప్రకారం 87,092 ఇళ్లను ఎన్యుమరేషన్ బ్లాక్లుగా విభజించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 28,32,490 కుటుంబాలు నివసిస్తుండగా, వాటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్వైజర్లను నియమించింది.
IPL Auction 2025: ఇది తెలుసా.. ఐపీఎల్ వేలంలో ఇటలీ ఆటగాడు!
తాజావార్తలు
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..