Ramchander Rao: రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..!
- రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..
- రాహుల్ గాంధీ తల్లితండ్రులది వేర్వేరు మతాలు.. ఆయనది ఏ కులం..
- బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరు: రామచందర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు. నరేంద్ర మోడీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసిపోయినట్లు గుర్తు చేశారు. ఇక, రాహుల్ గాంధీ తల్లి తండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు, ఆయన కులం ఏంటి?” అని ప్రశ్నించారు. అయితే, పార్టీలో పోస్టుల కోసం ఒత్తిడి చేయొద్దు అన్నారు. మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చినవారు ఎక్కువ కాదు, రాని వారు తక్కువ కాదని వెల్లడించారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీని ప్రకటిస్తుంది.. అందులో మొత్తం 20 మందిని నియమిస్తాం.. 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Balakrishna: హరిహర దర్శకుడితో బాలయ్య నెక్ట్స్?
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన సూచనల మేరకు పార్టీ నేతలు ఎక్కువ టూర్లు చేయాలని, కార్యకర్తల్ని కలవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ అంతర్గత సమస్యలు కుటుంబ సమస్యల వంటివే, వాటిని బయటకు తీసుకురావద్దు అన్నారు. అలాగే, దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమన్నట్టే, మేము కూడా పొన్నం ప్రభాకర్ను లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. బీజేపీ బీసీ పక్షపాతి.. బీసీలను పార్టీకి దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు.. మేము 42 శాతం రిజర్వేషన్కు సపోర్టు ఇస్తున్నాం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కేంద్రంపై నెట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు. బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరని, పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తెలియజేశారని రామచందర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!