President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం..
- లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు..
- దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ..
- లోక్ మంథన్ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ..
- నేటితో ముగిసిన రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం అని లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లోక్మంథన్ కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 2018 రాంచీలో జరిగిన లోకమంథన్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత ఇవాళ మరోసారి లోకమంథన్ లో పాల్గొనే అవకాశం కలిగిందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ఇది అన్నారు. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం.. పాటిస్తాం అన్నారు. ఇదే మన బలం, ఇదే మన స్థైర్యం అని తెలిపారు. ఇన్ని భిన్న సంస్కృతులు ఒకేచోట ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అన్నారు. ఇవన్నీ కలిసిన సుందరమైన ఇంద్రధనస్సు లాంటి దేశం మనదన్నారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతవాసులం అనే విషయాన్ని మరవొద్దన్నారు.
Read also: Adilabad: మహారాష్ట్రకు మగ పులి.. మరి ఆడ పులి ఎక్కడ?
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
లోకమంథన్ కార్యక్రమంలో.. అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరాంగనల పై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. వారి ప్రేరణ ఎప్పటికీ మనకు అవసరం అన్నారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం అభినందనీయం అన్నారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శిస్తుండటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక భావనలు, కళలు, సంగీతలు, విద్య, వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయన్నారు. ప్రపంచానికి మనం జ్ఞాన దర్శనం చేశామన్నారు. ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన మీద జులూం ప్రదర్శించాయి. మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయి. మనలో ఐకమత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు. మనలో బానిస మూలాలను చొప్పించారన్నారు.
Read also: TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
కానీ మన దేశ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. వీటిని నిరంతరం జీవింపజేశారన్నారు. ఇకపైనా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం బానిసత్వ మూలాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ మారిందన్నారు. దర్బార్ హాల్ పేరు.. గణతంత్ర మండప్ గా మార్చామన్నారు. ఇది బానిసత్వ ఆలోచనలను తొలగించే దిశగా జరుగుతున్న ప్రయత్నం అన్నారు. మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. ఇటీవల.. ఓ హైకోర్టులో మహిళా జడ్జి విగ్రహాన్ని ప్రారంభించారన్నారు. కానీ ఆ విగ్రహం కళ్లకు నల్లని గంతల కట్టలేదని, ఇది మనం సాధిస్తున్న మార్పుకు సంకేతం అన్నారు. మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. ఐకమత్యం, సమరసతే మన సభ్యత.. మన భవిష్యత్తు అన్నారు. ఈ దిశగా మనమంతా కలిసి పనిచేద్దామన్నారు. లోక్ మంథన్ కార్యక్రమం అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుగు ప్రయాణం అయ్యారు. నేటితో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన ముగింది.
Bhupalpally: హనుమాన్ విగ్రహానికి మంటలు.. స్థానికుల్లో ఆందోళన..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!