NTV Telugu Site icon

Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు

Hyd

Hyd

Mystery of Death: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో ముగ్గురు మృతుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కుమారుడు బాత్రూంలో మృతి చెంది కనిపించారు. అయితే, గ్యాస్ సిలెండర్ ద్వారా గీజర్ ను వాడుతున్న ఈ కుటుంబ సభ్యులు.. ఆ గ్యాస్ సిలెండర్ నుంచి విష వాయులు వెలువడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ముందుగా కుమారుడు స్నానం చేసేందుకు వెళ్లి సృహ తప్పి పడిపోయినట్లుగా గుర్తించిన పోలీసులు.. కుమారుడు పడిపోవడంతో బాత్రూంలోపలికి వెళ్లిన తల్లి, తండ్రి.. గ్లీజర్ నుంచి గ్యాస్ విడుదల కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిన ముగ్గురు.. గ్లిజర్ గ్యాస్ రెండు మిక్స్ అయి విష వాయులు వెలువడంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Astrology: జులై 23, మంగళవారం దినఫలాలు

ముగ్గురి మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను పోలీసులు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి.. కేసును సాల్వ్ చేశారు. ఈ ముగ్గురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో సనత్ నగర్ ఏరియాలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.